- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Supreme Courtలో జగన్ ఆస్తుల కేసు.. నిందితుడికి చుక్కెదురు
దిశ వెబ్ డెస్క్: జగన్ ఆక్రమాస్తుల కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. విచారణలో నిందితుడు బ్రహ్మానందరెడ్డికి చుక్కెదురు అయింది. వ్యాన్ పిక్ భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు గతంలో సీబీఐ కేసు దాఖలు చేసింది. ఈ కేసులో ఐఆర్ఎస్ అధికారి బ్రహ్మారెడ్డిని నిందితుడిగా చేర్చింది. దీంతో తనపై పెట్టిన సీబీఐ కేసును కొట్టివేయాలని నిందితుడు బ్రహ్మానందరెడ్డి ఈ ఏడాది జులైలో తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. బ్రహ్మానందరెడ్డిపై ఉన్న ఆరోపణలను పరిగణననలోకి తీసుకుని క్వాష్ను నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టును బ్రహ్మానందరెడ్డి ఆశ్రయించారు. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని, అలాగే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు ధర్మసనం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అంతేకాదు జోక్యం చేసుకునే అంశాలు కూడా ఏమీ లేవని తెలిపింది.
Also Read....