ఏపీని కేసీఆర్‌కు అమ్మేసేందుకు జగన్ ప్లాన్ : కన్నా లక్ష్మీనారాయణ

by Disha Web Desk 21 |
ఏపీని కేసీఆర్‌కు అమ్మేసేందుకు జగన్ ప్లాన్ : కన్నా లక్ష్మీనారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.వైఎస్ జగన్ వ్యవహార శైలి..అనుభవ లేమి వల్ల హైదరాబాద్‌లో ఆంధ్రుల ఆస్తులు పోయాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అమ్మేయాలని జగన్‌ చూస్తున్నారని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే ఏపీని కేసీఆర్‌కు గంపగుత్తగా అమ్మేస్తారని మండిపడ్డారు. ఎన్జీ రంగా 123వ జయంతి సందర్భంగా గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌లో ఆయన విగ్రహానికి కన్నా లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి గెలిచారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోసాలను ప్రజలంతా గమనించారని కన్నా లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. ఈ సారి వైసీపీని ప్రజలు గెలిపించరనే అభద్రతా భావంతో ఈసారి ఓటర్ల జాబితాలో మార్పులు చేసి గెలవాలని జగన్ చూస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ప్రజలు వారి ఓటును కాపాడుకోవాలని.. తద్వారా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని సూచించారు. మరోవైపు నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా 40 రోజులుగా తెలంగాణకు నీరు వెళ్తోందని... అయినా జగన్ పట్టించుకోవడం లేదని కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed