SIT enquiry : సిట్​ వేట.. జగన్​ పీఏ ఇంట్లో సోదాలు?

by Thanuru Gopichand |   (  Updated:2025-05-08 07:01:08  IST  )

ఏపీ లిక్కర్​స్కాం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. విజయవాడ వెటర్నరీ కాలనీలో సిట్​అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

SIT enquiry : సిట్​ వేట..  జగన్​ పీఏ ఇంట్లో సోదాలు?
X

మిగిలిన నిందితుల ఇళ్ళలోనూ తనిఖీలు

విజయవాడ వెటర్నరీ కాలనీలో..

మరో వైపు ముగ్గురు నిందితులకు సుప్రీం బెయిలు నిరాకరణ

ఏపీలో లిక్కర్​స్కాం విచారణలో కీలక మలుపు

దిశ, డైనమిక్​ బ్యూరో : ఏపీ లిక్కర్​స్కాం కేసు (AP Liquor Scam)) రోజుకో మలుపు తిరుగుతోంది. విజయవాడ వెటర్నరీ కాలనీలో సిట్​అధికారులు తనిఖీలు చేస్తున్నారు.ఉదయం 10.30 గంటల నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ధనుంజయ్​రెడ్డి, కష్ణమోహన్​ నివాసాల్లో సిట్​అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జగన్ (YS Jagan) ​వ్యక్తిగత సహాయ కార్యదర్శి కేఎన్​ఆర్​ నివాసంలోనూ సోదాలు చేస్తున్నారు. మరోవైపు ఏపీ మద్యం కుంభకోణంలో కేసులో నిందితులకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు నిందితులకు ముందస్తు బెయిలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కష్ణమోహన్​రెడ్డి, ధనుంజరరెడ్డి, బాలాజీ గోవిందప్పకు మధ్యంతర ఉపశమనానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటిప్పుడు మధ్యంతర రక్షణ ఇవ్వలేమని జస్టిస్​పార్ధివాలా ధర్మాసనం తెలిపింది.

హైకోర్టులో పెండింగ్లో ఉండగానే పిటిషన్​దాఖలు చేశారని పేర్కొంది. హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో విచారణ కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. అవసరం అనుకుంటే నిందితులు మరో పిటిషన్​ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ధర్మాసనం ఈనెల 13కి వాయిదా వేసింది. లిక్కర్​స్కాంకు సంబంధించి ఈ రోజు టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్​సీబీఐకి ఒక లేఖకూడా రాశారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జగన్​పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్​డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్​కే చేరాయంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు అరెస్టు అయి రిమాండ్​లో ఉన్నారు. వారిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. విచారణలో బయటపడిన వాస్తవాల ఆధారంగా ఈ రోజు విజయవాడలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

Next Story