రాష్ట్రంలో పెట్టుబడులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
రాష్ట్రంలో పెట్టుబడులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పెట్టుబడుల ప్రతిపాదనలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రతిపాదనల విలువ రూ.13 లక్షల కోట్లు అని ఏపీ సీఎం జగన్ అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ - 2023 లో సీఎం జగన్ మాట్లాడుతూ.. బలమైన ఆర్థిక నగరంగా విశాఖ ఎదిగిందన్నారు. జీ 20 కి భారత్ అధ్యక్షత వహిస్తోందన్నారు. ఇండియాలో అతి కీలకమైన రాష్ట్రం ఏపీ అన్నారు. ఏపీలో బలమైన మౌళిక సదుపాయాలున్నాయన్నారు.

రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు 345 ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఈ ప్రతిపాదనల విలువ రూ.13 లక్షల కోట్లని తెలిపారు. పెట్టుబడులకు విశాఖ ఆకర్షణీయ స్థలం అని స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరిగాయన్నారు. నీతి ఆయోగ్ నివేదికలో 3 వ స్థానంలో ఏపీ ఉందన్నారు. ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. నూతన భారత నిర్మాణంలో ఏపీ కీలకం కాబోతుందన్నారు.



Next Story