AP Politics: ఆ జిల్లా పర్యటనకు సిద్దమైన జగన్.. డేట్ ఫిక్స్.

by Disha Web Desk 3 |
AP Politics: ఆ జిల్లా పర్యటనకు సిద్దమైన జగన్.. డేట్ ఫిక్స్.
X

అమలాపురం /రావులపాలెం ఏప్రిల్ 13:వైసీపీ అధినతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావులపాలెంలో పర్యటించనున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ఉమ్మడి గోదావరి జిల్లాల వై.యస్.ఆర్.సి.పి.రీజినల్ కోఆర్డినేటర్లు పిల్లి సుభాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ రావులపాలెంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ నెల 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 03:00 గంటలకు రావులపాలెంలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభకు ముఖ్యంమత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారని తెలియచేశారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన సీఎం జగన్ రాజమండ్రి చేరుకోనున్నారని తెలిపారు.

ఇక 16వ తేదీన రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ తరువాత రోజు అనగా 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సెలవు తీసుకోనున్నారని పేర్కొన్నారు. ఇక 18వ తేదీ మధ్యాహ్నం రావులపాలెంలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారని తెలిపారు.

కాగా ఈ సభకు సుమారు 2 లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సభకు హాజరై విజయవంతం చేయవలసినదిగా వైసీపీ నాయకులు కోరారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కుడుపూడి సూర్యనారాయణ, తోట త్రిమూర్తులు, పొన్నాడ వెంకట సతీష్, చిర్ల జగ్గిరెడ్డి, పిల్లి సూర్యప్రకాష్, విప్పర్తి వేణుగోపాల్, రాపాక వరప్రసాద్, చింతా అనురాధ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed