YS Jagan: అమరావతిలో సందడి వేళ.. బెంగళూరులో జగన్!

by Thanuru Gopichand |

అమరావతిలో పండుగ వాతావరణం నెలకొంది. రాజధాని పనుల పున:ప్రారంభ వేళ దేశం మొత్తం ఇటువైపే చూస్తోంది.

YS Jagan: అమరావతిలో సందడి వేళ.. బెంగళూరులో జగన్!
X

అప్పుడూ అంతే.. ఇప్పుడూ అంతే

ప్రధాని ప్రకటన తర్వాతే మనసులో జగన్​మనసులో మాట వెల్లడి?

దిశ, డైనమిక్​ బ్యూరో: అమరావతిలో (Amaravathi) పండుగ వాతావరణం నెలకొంది. రాజధాని పనుల పున:ప్రారంభ వేళ దేశం మొత్తం ఇటువైపే చూస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ క్రతువులో పాల్గొననునారు. అయితే ఏపీలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తంచాలని కోరుకుంటున్న వైఎస్​జగన్​ఈ సమయంలో రాజధాని ప్రాంతం నుంచి వెళ్లపోయారు. నిన్న సాయంత్రమే ఆయన బెంగళూరుకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ప్రభుత్వం నుంచి జగన్​కు ఆహ్వానం అందింది. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో అధికారులు ఆహ్వాన పత్రికను ఆయన పర్సనల్​సెక్రటరీకి అందజేశారు. అయితే స్వయంగా ప్రధాని హాజరవుతున్న సభకు జగన్​రావడానికి ఆసక్తి చేపలేదు.

2015లోనూ అమరావతి పనుల ప్రారంభోత్సవానికి అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్​కు ప్రభుత్వం ఆహ్వానాన్ని పలికింది. అయితే ఆ సమయంలోనూ ఆయన హాజరు కాలేదు. అప్పుడు ఉద్దండ్రాయునిపాలెంలో ప్రధాని మోదీనే అమరావతి పనులకు శంకుస్తాపన చేశారు. జగన్​అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మూడు రాజధానులంటూ కొత్తరాగం అందుకున్నారు. ఆయన ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాజధాని రైతులు ఉద్యమించారు. దాదాపు మూడేళ్ల పాటు సుదీర్ఘ ఉద్యమాన్ని నడిపారు. మొన్నటి ఎన్నికల్లో జగన్​ అధికారం కోల్పోగానే అమరావతిపై పునరాలోచనలో పడ్డట్టు రాజకీయ పరిశీలకులు భావించారు. ఆయన హుందాగా నేడు జరగబోయే కార్యక్రమానికి హాజరవుతారని కొంతమంది భావించారు. అయితే ఆయన ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయన ఈ కార్యక్రమానిక డుమ్మా కొట్టినట్లు అని భావిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాజధానికి సంబంధించిన కీలక ప్రకటన చేస్తారని అంతా భావిస్తున్నారు. ఆయన ప్రకటన తర్వాత వైఎస్​జగన్​రాజధానిపై స్పందిస్తారని, తన మనసులో ఉన్న మాటను వెల్లడిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పటి వరకు అమరావతిపై తన స్టాండును జగన్​బయట పెట్టబోరని, పార్టీ నేతలు కూడా ఎక్కడా దీనిపై వ్యాఖ్యలు చేయవద్దని కూడా సూచించినట్లు సమాచారం.

Next Story