- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతిలో హై టెన్షన్.. మరోసారి బాంబు బెదిరింపులు
తాజాగా మరోసారి తిరుపతిలోని 2 హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అలిపిరి (Alipiri) పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్పార్క్, పాయ్వైస్రాయ్ హోటల్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్: గురువారం అర్థరాత్రి తిరుపతి (Tirupati)లోని కొన్ని హోటళ్లకు బాంబు బెదిరింపులు రాగా.. పోలీసులు ఆయా హోటళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటళ్లలో ఎక్కడా బాంబులు లేవని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా మరోసారి తిరుపతిలోని 2 హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అలిపిరి (Alipiri) పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్పార్క్, పాయ్వైస్రాయ్ హోటల్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఐఎస్ఐ ఉగ్రవాదుల (ISI Terrorists) పేరుతో 2 మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. డాగ్ స్క్వాడ్ (Dog Squad)తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఉగ్రవాదికి జైలుశిక్ష వేయడం వెనుక సీఎం స్టాలిన్ హస్తం ఉండగా.. తమిళనాడులో కొన్ని స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలోనే వారికి సంబంధించి తిరుపతిలో ఉన్న హోటళ్లకు 2 రోజుల క్రితం ఉగ్రవాదుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా వచ్చిన బెదిరింపులతో తిరుపతిలో హై టెన్షన్ నెలకొంది.






