కృష్ణంరాజు భార్య పొలిటికల్ ఎంట్రీ అప్పుడేనా..?

by Disha Web Desk 5 |
కృష్ణంరాజు భార్య పొలిటికల్ ఎంట్రీ అప్పుడేనా..?
X

దిశ, వెబ్ డెస్క్: దివంగత నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తారని జరుగుతున్న ప్రచారంపై ఆవిడ క్లారిటీ ఇచ్చారు. ఇవ్వాళ కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్ నిర్వహణను శ్యామలాదేవి స్వయంగా చూసుకుంటున్నారు.

అక్కడ మీడియాకి ఇచ్చిన ఇంటర్వూలో ఆవిడ మాట్లాడుతూ.. కృష్ణంరాజు మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తానని ఆమె వివరించారు. పేదలకు విద్య, వైద్యం అందేలా చూడాలని ఆయన ఎంతగానో తపనపడేవారని, అందుకే ఆయన జయంతి సందర్భంగా మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతానికి తన ఆలోచన అంతా నిరుపేదలకు వైద్యం అందించడంపైనే ఉందని చెప్పారు. జయంతి వేడుకలు, హెల్త్ క్యాంప్ విజయవంతంగా పూర్తయ్యాక తన రాజకీయ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తానని ఆమె వివరించారు. కాగా వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీ అభ్యర్ధిగా కృష్ణంరాజు భార్య శ్యామలదేవి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed