నేనంటే ఏంటో చూపిస్తా..భయపడే పరిస్థితి తీసుకొస్తా: బండారుపై మంత్రి రోజా

by Disha Web Desk 21 |
నేనంటే ఏంటో చూపిస్తా..భయపడే పరిస్థితి తీసుకొస్తా: బండారుపై మంత్రి రోజా
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తిని వదిలిపెట్టేది లేదని మంత్రి ఆర్‌కే రోజా వార్నింగ్ ఇచ్చారు. తనపై మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఒకమనిషి చనిపోతే కొన్ని రోజులే బాధపడతారని కానీ తాను ఈ నిందలను జీవితాంతం భరించాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళగా తాను సినీ రంగంలోకి ప్రవేశించి ఎలా ఎదిగానో అందరికీ తెలుసునన్నారు. ఎలాంటి బ్యాక్‌ సపోర్ట్ లేకుండా అటు సినీనటిగా అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు టికెట్ ఇచ్చి రెండు సార్లు గెలిపించి మంత్రిని చేశారని అన్నారు. కష్టపడి పైకి వచ్చిన తనపై ఇలాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మంత్రిగా ఉన్న తనపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి దుర్మార్గులు బయటకు రాకూడదన్నారు. నేనేంటో చూపిస్తానని హెచ్చరించారు. బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వ్యక్తులు మరోసారి మహిళల పట్ల చులకనగా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి తీసుకువస్తామన్నారు. బండారు సత్యనారాయణలాంటి చీడపురుగులను ఏరివేసేలా చట్టాలు తీసుకువచ్చేందుకు పోరాడుతానన్నారు. క్రిమినల్ డిఫమేషన్, సివిల్ డిఫమేషన్ దాఖలు చేస్తానని తెలిపారు. సుప్రీంకోర్టులో కూడా పోరాటం చేస్తానని మంత్రి ఆర్‌కే రోజా స్పష్టం చేశారు.



Next Story

Most Viewed