చంద్రబాబు జైల్లో మగ్గుతుంటే అన్నం తినబుద్ధి కావడం లేదు : బండ్ల గణేశ్

by Disha Web Desk 21 |
చంద్రబాబు జైల్లో మగ్గుతుంటే అన్నం తినబుద్ధి కావడం లేదు : బండ్ల గణేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై సినీ నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. చంద్రబాబు నాయుడు తెలుగు జాతి సంపద అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని బండ్ల గణేశ్ అన్నారు. చంద్రబాబు మళ్లీ గెలుస్తారు.. సీఎం అవుతారు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో మగ్గుతుంటే అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు అని బండ్ల గణేశ్ అన్నారు. ఐటీ ఉద్యోగులు పార్కుల ముందు, రోడ్లపై కాదు సొంతూళ్లకు వెళ్లి బొడ్రాయి ముందు కూర్చుని ధర్నాలు చేయాలి అని చెప్పుకొచ్చారు. ఐటీ ఉద్యోగులు నెల రోజుల పాటు ఉద్యోగాలు మానేసి సొంతూళ్లకు వెళ్లి ధర్నాలు చేయాలి అని సినీ నిర్మాత బండ్ల గణేష్ సూచించారు.

Read More..

బ్రేకింగ్.. చంద్రబాబు అరెస్ట్‌పై ఢిల్లీలో దీక్షకు దిగిన నారా లోకేష్

చంద్రబాబుకు బెయిలా..? లేక జైలేనా..? నేడే కీలకం.. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ

Next Story

Most Viewed