ప్రియుడి మోజులో భర్త హత్య.. భార్య, ప్రియుడి అరెస్ట్

by Vemula.Srinu Prasad |

దేవరాపల్లి మండలం రైవాడ పంచాయతీ శ్రీరామపురంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో తన ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. ..

ప్రియుడి మోజులో భర్త హత్య.. భార్య, ప్రియుడి అరెస్ట్
X

దిశ, అనకాపల్లి: దేవరాపల్లి మండలం రైవాడ పంచాయతీ శ్రీరామపురంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో తన ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. మృతుడు దారపురెడ్డి అప్పలనాయుడు (43)గా పోలీసులు గుర్తించారు. అప్పలనాయుడు భార్య హైమకు గంగాధర్ అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు హైమతో పాటు గంగాధర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాస్తు చేస్తున్నారు.

మృతుడు అప్పలనాయుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతితో ఆ చిన్నారులు తండ్రిని కోల్పోవడం, హత్య కేసులో తల్లి పోలీసుల అదుపులో ఉండటంతో వారి భవిష్యత్తుపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story