చెన్నైలో ఏపీ వాసుల నుంచి భారీగా నగదు, బంగారం పట్టివేత

by Disha Web Desk 16 |
చెన్నైలో ఏపీ వాసుల నుంచి భారీగా నగదు, బంగారం పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: చెన్నైలో ఏపీ వాసుల నుంచి భారీగా నగదును, బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఏపీకి చెందిన మహిళ ట్యాక్స్‌కు భయపడి బిల్లులు తీసుకొనకుండా బంగారం కొనుగోలు చేశారు. అనంతరం తమ స్వగ్రామానికి వెళ్తేందుకు యత్నించారు. అయితే తిరువల్లూరులో నగదును, బంగారాన్ని వాహన తనిఖీల్లో పోలీసులు గుర్తించారు. ఎన్నికల అధికారులకు తగిన పత్రాలు చూపించలేదు. దీంతో 26 గ్రాముల బంగారు కడ్డీలను సీజ్ చేశారు. లెక్కలు చూపని17 లక్షల 39 లెక్కల్లో చూపని డబ్బును సైతం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ సొమ్మును తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి అప్పగించారు. ఈ డబ్బులు, నగలు ఖజానాకు అప్పగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Next Story