తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |

తిరుపతి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రేణిగుంట-మాముండూరు జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది....

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati District)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రేణిగుంట-మాముండూరు జాతీయ రహదారి(Renigunta-Mamundur National Highway)పై ద్విచక్రవాహనాన్ని లారీ(Lorry) బలంగా ఢీకొట్టింది. బైక్‌(Byke)పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద ధాటికి వాహనం నుజ్జునుజ్జు అయింది. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. లారీ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story