ఖైదీలకు రాఖీ కట్టిన హోంమంత్రి అనిత

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-09 10:33:44  IST  )

హోం మంత్రి అనిత సెంట్రల్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా 30 మంది ఖైదీలకు రాఖీ కట్టారు.

ఖైదీలకు రాఖీ కట్టిన హోంమంత్రి అనిత
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు సంబరంగా జరుగుతున్నాయి. రాఖీ పండుగను పురస్కరించుకుని హోంమంత్రి అనిత (Home Minister Anita) ఇవాళ విశాఖపట్నంలోని సెంట్రల్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె జైళ్ల శాఖ అధికారులకు రాఖీ కట్టి, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, 30 మంది ఖైదీలకు రాఖీ కట్టారు. అనంతరం గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు గంజాయి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

Next Story