తుఫాను ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవులు డిక్లేర్

by Muthe.Rajitha |

ఏపీలో మొంథా తుఫాను తీవ్ర ప్రభావం చూపనుంది.

తుఫాను ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవులు డిక్లేర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో మొంథా తుఫాను తీవ్ర ప్రభావం చూపనుంది. అక్టోబర్ 28న కాకినాడ వద్ద తుఫాను తీరం దాటనుంది. ఈ క్రమంలో 100కి.మీల వేగంతో ఈదురు గాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని అత్యంత ప్రభావిత జిల్లాల్లో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. కాగా నేడు మరిన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

తూర్పుగోదావరి జిల్లాలో 27,28 తేదీల్లో సెలవులు ప్రకటించగా.. కడప, అన్నమయ్య జిల్లాల్లో 27,28 తేదీల్లో.. గుంటూరు, బాపట్ల జిల్లాలో మూడురోజులు సెలవులు ఇచ్చారు. అలాగే కృష్ణా జిల్లాలో 27,28,29 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ఇవ్వగా.. కాకినాడ జిల్లాలో ఐదురోజులు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

Next Story