రాజమండ్రి సెంట్రల్‌ జైలు దగ్గర హైటెన్షన్‌

by Ajay Maddhiboyina |

రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు ద‌గ్గ‌ర హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. మ‌రికొద్దిసేప‌ట్లో ఎంపీ మిథున్ రెడ్డిని జైలుకు తీసుకురానున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు భారీ సంఖ్య‌లో జైలు వ‌ద్ద‌కు చేరుకున్నారు.

రాజమండ్రి సెంట్రల్‌ జైలు దగ్గర హైటెన్షన్‌
X

దిశ, వెబ్ డెస్క్: రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు ద‌గ్గ‌ర హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. మ‌రికొద్దిసేప‌ట్లో ఎంపీ మిథున్ రెడ్డిని జైలుకు తీసుకురానున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు భారీ సంఖ్య‌లో జైలు వ‌ద్ద‌కు చేరుకున్నారు. గ‌తంలో గోదావ‌రి జిల్లాల వైసీపీ కో ఆర్డినేట‌ర్‌గా ఉండటం వల్ల స్థానిక వైసీపీ కార్యకర్తలు జైలు వద్దకు చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉండగా శనివారం సుమారు 6 గంటల పాటు విచారించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నేడు కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది.

Next Story