వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

by Jakkula.Mamatha |

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (Vallabhaneni Vamsi) మరోసారి షాక్ తగిలింది.

వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (Vallabhaneni Vamsi) మరోసారి షాక్ తగిలింది. తమ భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై అత్కూరు పోలీసు‌స్టేషన్‌లో వల్లభనేని వంశీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు(High Court)లో ఇవాళ(సోమవారం) విచారణ జరిగింది. భూ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు. కానీ న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇక లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ(CID)ని ఆదేశించిన హైకోర్టు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Next Story