చెవిరెడ్డి మోహిత్ ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

by Ajay Maddhiboyina |

ఏపీ హైకోర్టులో లిక్క‌ర్ కేసుపై నేడు విచార‌ణ జ‌రిగింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ పై విచార‌ణ‌ను న్యాయ‌స్థానం వాయిదా వేసింది.

చెవిరెడ్డి మోహిత్ ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ హైకోర్టులో లిక్క‌ర్ కేసుపై నేడు విచార‌ణ జ‌రిగింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ పై విచార‌ణ‌ను న్యాయ‌స్థానం వాయిదా వేసింది. అప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సిట్ ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. త‌దుప‌రి తీర్పు వ‌చ్చే వ‌ర‌కు ఈ ఆదేశాలు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉంటే ఈ కేసులో మోహిత్ రెడ్డి తండ్రి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి నింధితుడిగా ఉన్నారు. భాస్కర్ రెడ్డి ఈ కేసులో ఏ 38గా ఉండగా ఇప్పటికే సిట్ అధికారులు ఆయనను విచారించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహతుడు వెంకటేష్ నాయుడు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన ఈ కేసులో ఏ 34గా ఉన్నారు. భాస్కర్ రెడ్డి డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలంతో అధికారులు మోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు.

Next Story