Rajini : కూటమి పాలనలో ఆరోగ్య సేవలు అటకెక్కాయి : విడదల రజని

by Y. Venkata Narasimha Reddy |

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి(TDP Alliance) ప్రభుత్వం ఆరోగ్య శ్రీని పూర్తిగా పక్కకు పెట్టిందని మాజీ మంత్రి విడదల రజని(Rajini)విమర్శలు గుప్పించారు.

Rajini : కూటమి పాలనలో ఆరోగ్య సేవలు అటకెక్కాయి : విడదల రజని
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి(TDP Alliance) ప్రభుత్వం ఆరోగ్య శ్రీని పూర్తిగా పక్కకు పెట్టిందని మాజీ మంత్రి విడదల రజని(Rajini)విమర్శలు గుప్పించారు. రజని మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో ఆరోగ్య ఆసరా ఊసు లేదని, సురక్షా ప్రస్తవన లేదన్నారు. ఫ్యామిలీ డాక్టర్ పథకం లేదు..నాడు నేడు లేదని.. కొత్త మెడికల్ కాలేజీలు లేవని విమర్శి్ంచారు. 108,104 సేవలు అటకెక్కాయని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి హయంలో ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా, మెడికల్ హబ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

వైద్యం ఖరీదైన నేటీ రోజుల్లో జగన్ అమలు చేసిన ఆరోగ్య పథకాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. కూటమి ప్రభుత్వ హయంలో పేదల ఆరోగ్యం గాలిలో దీపమైందని, ప్రజలు దీనిపై ఒకసారి ఆలోచన చేయాలని రజని సూచించారు.

Next Story