జోగి రమేశ్‌ను ప్రస్తావిస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్‌.. డీజీపికి ఫిర్యాదు

by Vemula.Srinu Prasad |

నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేశ్‌ను ప్రస్తావిస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్‌ చేయడంపై డీజీపికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు..

జోగి రమేశ్‌ను ప్రస్తావిస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్‌.. డీజీపికి ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నకిలీ మద్యం కేసు(Face Liquor Case) వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు జనార్ధన్ రావు(Accused Janardhan Rao) కేసు విచారణలో కీలక విషయాలు చెప్పారు. నకిలీ మద్యం తయారు చేయమని మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్(Ycp Leader Jogi Ramesh) చెప్పారని, అందువల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ప్రారంభించామని తెలిపారు. దీంతో నకిలీ మద్యం ఘటనలో జోగి రమేశ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే నకిలీ మద్యం స్కాంపై రాష్ట్రవ్యాప్తంగా కొందరు ఐవీఆర్ కాల్స్ చేపట్టారు. మాజీ మంత్రి జోగి రమేశ్ పేరు ప్రస్తావిస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ చేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, లీగల్ సెల్ సీరియస్ అయింది. డీజీపి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story