- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సొరంగ మార్గం పూర్తి.. గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టులో కీలక మైలురాయి
by Ramesh Naini |
గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టు పనుల్లో భారతీయ రైల్వే మరో ఘన విజయం సాధించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టు పనుల్లో భారతీయ రైల్వే మరో ఘన విజయం సాధించింది. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 320 మీటర్ల పొడవైన 'గాజులపల్లి - చెలిమ' సొరంగ మార్గం తవ్వకం (Breakthrough) పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) శనివారం అధికారికంగా వెల్లడించింది. ఈ సొరంగ మార్గం పూర్తికావడంతో డబ్లింగ్ పనులు వేగవంతం అయ్యాయని, ఈ ప్రాంతంలో రైలు రవాణా వ్యవస్థ (Rail Connectivity) మరింత బలోపేతం కానుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా ఇది ఒక ముందడుగని రైల్వే శాఖ పేర్కొంది.
Next Story






