కొండవీడు అభివృద్ధిపై మంత్రి దుర్గేశ్ కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

పల్నాడు జిల్లాలో కొండవీడు ఫెస్ట్ వైభవంగా కొనసాగుతోంది..

కొండవీడు అభివృద్ధిపై మంత్రి దుర్గేశ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలో కొండవీడు ఫెస్ట్ వైభవంగా కొనసాగుతోంది. ఈ ఫెస్ట్‌లో మంత్రి దుర్గేశ్ తో పాటు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ కొండవీడు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని అప్పటి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డినే ఒప్పుకున్నారని దుర్గేశ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ త్వరలోనే చౌడవరం- కొండవీడు కోటకు టన్నెల్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. అలాగే కొండవీడులో 30 కాటేజీలు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.

Next Story