Guntur: అన్ని తేలుస్తాం.. సజ్జలకు ధూళిపాళ్ల వార్నింగ్

by Disha Web Desk 16 |
Guntur: అన్ని తేలుస్తాం.. సజ్జలకు ధూళిపాళ్ల వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగం త్వరలో ఊడిపోవడం ఖాయమని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని తేలడంతో సజ్జలకు భయం పట్టుకుందన్నారు. నారా లోకేశ్‌పై సజ్జల చేసిన వ్యాఖ్యల్లో ఫ్రస్టేషన్ కనిపిస్తుందని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. సజ్జల లాంటి బాడుగ నేతల బతుకుల లెక్కలు అన్ని తేలుస్తామని హెచ్చరించారు. క్యాంప్ ఆఫీస్ సీనియర్ క్లర్క్ సజ్జలకు త్వరలో తన ఉద్యోగం పోతుందని భయం పట్టుకున్నట్లు ఉందని, అందుకే ఆ ఫ్రస్టేషన్‌లో నోరు జారుతున్నాడని మండిపడ్డారు. తండ్రి శవం పక్కన సంతకాలు సేకరించిన నీతిమాలిన నాయకత్వాన పని చేస్తూ పుట్టుకల గురించి మాట్లాడితే జనం హర్షించరని ధ్వజమెత్తారు.

సైకో ఎవరో...ఎవరు మనస్తత్వం వైకల్యంతో బాధపడుతున్నారో...ఎవరి పుట్టుక రాష్ట్రానికి...సొంత కుటుంబానికి శాపంలా మారిందో... యావత్తు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని సజ్జల విరుచుకుపడ్డారు. క్రిమినల్ కోసం క్రిమినల్ పనులు చేస్తున్న సజ్జల మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ‘మీ భవిష్యత్ దుర్బరంగా ఉండబోతుంది...మీ అహంకారం కుప్ప కూలుతుంది. అప్పుడు మీ లాంటి బాడుగ నేతల బతుకుల లెక్క తేలుతుంది. నాడు మీ బానిసత్వం, మీ పుట్టుక మీకే అసహ్యాన్ని కలిగిస్తుంది.’ అంటూ ధూళిపాళ్ల నరేంద్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed