- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Breaking: ఉద్దేశపూర్వకంగానే దాడి.. ఘటనపై బీజేపీ నేత రమేశ్ నాయుడు ఆగ్రహం
దిశ, వెబ్ డెస్క్: అమరావతిలో బీజేపీ నేత సత్యకుమార్ రాజు కాన్వాయ్పై కొందరు ఆందోళనకారులు దాడి చేశారు. ’ఈ ఘటనను బీజేపీ నేత రమేశ్ నాయుడు ఖండించారు. ఘటన చాలా దురదృష్టకరం. డే వన్ నుంచీ అమరావతికి జై కొట్టాం. రైతులను కలిసి మద్దతు తెలిపాం. అయితే తిరిగి వెళ్తున్న సమయంలో పక్కా పథకం ప్రకారం, ఉద్దేశపూర్వకంగా మా కాన్వాయ్పై దాడి చేశారు. పోలీసుల అండతో మందడం శిబిరం వద్ద మా కాన్వయ్ను స్లో చేపించారు. ఆ సమయంలో పోలీసులు మా కార్యకర్తలను పట్టుకున్నారు. ఆందోళనకారులను ప్రోత్సహిస్తూ వెనుక నుంచి రాళ్లు రువ్విస్తూ మా వెహికల్పై పడేటట్లు చేశారు. మా కార్యక్తలపై భౌతికదాడులకు దిగారు. ఈ ఘటనను బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. అమరావతికి మద్దతు ఇస్తే దాడుల చేస్తాం. భయపడేతాం. అంటే చూస్తూ ఉండే ప్రసక్తే లేదు.బీజేపీ కార్యకర్తలు ఇలాంటి సంఘటనలను చాలా చూశారు. నక్సలైట్లతో పోరాడిన చరిత్ర బీజేపీది.’ అని రమేశ్ నాయుడు తెలిపారు.
బీజేపీ నేత సత్యకుమార్ కాన్వాయ్పై రాళ్ల దాడి
కాగా బీజేపీ నేత సత్యకుమార్ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేపట్టిన ఆందోళన 1200వ రోజుకు చేరింది. అయితే మద్దతు తెలిపేందుకు సత్యకూమార్ వెళ్లారు. దీక్షా శిబిరం వద్ద రైతులను కలిసి తుళ్లూరులోని పార్టీ నాయకుడిని పరామర్శించారు. తిరిగి వెళ్తున్న సమయంలో మందడం దగ్గర కొందరు ఆందోళనకారులు ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్పై దాడి చేశారు. రాళ్లు రువ్వారు. దీంతో సత్యకుమార్ కాన్వాయ్లోని కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.