Breaking: క్రాస్ ఓటింగ్‌పై సజ్జల సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Breaking: క్రాస్ ఓటింగ్‌పై సజ్జల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్తి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించారు. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరగడం వల్లే ఆమె గెలిచిందని స్పష్టమైంది. అయితే వైసీపీ నాయకత్వంపై నమ్మకం లేకనే తమకు ఓటు వేశారని టీడీపీ అంటుంటే.. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని ఆరోపించారు. ప్రలోభాల్లో చంద్రబాబు ప్రపంచ నెంబర్ వన్ అని వ్యాఖ్యానించారు. ప్రలోభాల్లో చంద్రబాబుతో పోటీ పడలేమని విమర్శించారు. 175 స్థానాల్లో పోటీ చేసి గెలవగలిగే ధీమా వాళ్లకు ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు 23 స్థానాలకు మించి రావని సజ్జల జోస్యం చెప్పారు.

Next Story

Most Viewed