రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి బరిలో మాధవ్.. అనుచరులతో కలిసి నామినేషన్ దాఖలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-30 06:25:29  IST  )

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి బరిలో మాధవ్ దిగారు...

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి బరిలో మాధవ్.. అనుచరులతో కలిసి నామినేషన్ దాఖలు
X

దిశ వెబ్ డెస్క్: ఏపీ బీజేపీ అధ్యక్షుడిపై కసరత్తు కొలిక్కివచ్చింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ బరిలో దిగారు. నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక మంగళవారం ఎన్నిక జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితం ప్రకటించనున్నారు. అయితే ఈ అధ్యక్ష పీఠంపై పలువురు ఆశవహులు ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారు కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరి పని చేశారు. అయితే ఆమె పదవీకాలం ముగియడంతో మరో అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యం అయింది. దీంతో పలువురు పేర్లను పరిశీలించారు. చివరకు మాధవ్‌ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఆయన నామినేషన్ వేశారు.

Next Story