భారత్, పాక్ పరిస్థితులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. వైసీపీ మహిళా Mptc అరెస్ట్

by srinivas |
భారత్, పాక్ పరిస్థితులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. వైసీపీ మహిళా Mptc అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్(Bharat), పాకిస్థాన్(Pakistan) మధ్య నెలకొన్న పరిస్థితులపై ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని, బేఖాతర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ(Ycp) మహిళా నాయకురాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటన ఏపీ రాష్ట్రం గుంటూరు జిల్లా(Guntur District)లో జరిగింది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు(Kanteru)కు చెందిన ఎంపీటీసీ కల్పన(Mptc Kalpana).. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న సమయంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పోస్ట్ చేశారు. కేంద్రప్రభుత్వం హెచ్చరికలను పట్టించుకోకుండా ఈ పోస్టులపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఆమెను శుక్రవారం అరెస్ట్ చేశారు.



Next Story

Most Viewed