CM Jagan: నూతన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు

by Disha Web Desk 16 |
CM Jagan: నూతన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌ను నూతన ఎమ్మెల్సీలు కలిశారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో నూతన ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్సీ నర్తు రామారావు ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి స్థానిక సంస్థల అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్‌లు సీఎం జగన్‌ను కలిశారు. మంత్రులు తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీమంత్రి శ్రీ రంగనాథరాజులతోపాటు ప్రభుత్వ చీఫ్ విప్‌ ముదునూరి ప్రసాదరాజులతో కలిసి సీఎం జగన్‌ను కలిశారు.

మరోవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి జిల్లా ఇన్‌చార్జి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మంత్రులు కాకాణి గోవర్థన్ రెడ్డి, ఆర్‌కే రోజా, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌లతో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. నూతన ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. తమకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎంకు నూతన ఎమ్మెల్సీలు ధన్యవాదాలు తెలిపారు.


Next Story