అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు: ఎన్డీఏ గెలుపుపై ఎంపీ లావు స్పందన

by Vemula.Srinu Prasad |

అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్.డి.ఏ కూటమి సాధించిన విజయం చారిత్రాత్మకమని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు , టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ...

అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు: ఎన్డీఏ గెలుపుపై ఎంపీ లావు స్పందన
X

దిశ, నరసరావుపేట ప్రతినిధి: అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్.డి.ఏ కూటమి సాధించిన విజయం చారిత్రాత్మకమని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు మరియు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. దేశంలో అభివృద్ధి, స్థిరత్వం, నిర్ణయాత్మక పాలనపై ప్రజలకున్న అచంచలమైన విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా , బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబిన్ ల తో పాటు జాతీయ నాయకత్వం అందించిన దిశా నిర్దేశం ఈ అద్భుత విజయానికి బాటలు వేసిందన్నారు. అభివృద్ధి అజెండాను నమ్మి ఎన్.డి.ఏ కి పట్టం కట్టిన ఆయా రాష్ట్రాల ప్రజలకు, విజయం కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు మరియు కూటమి నాయకత్వానికి శ్రీ కృష్ణ దేవరాయలు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Next Story