రైలు కిందపడి పసికందుతో సహా తల్లి ఆత్మహత్య

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-18 19:07:15  IST  )

బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరులో విషాద ఘటన చోటుచేసుకుంది.

రైలు కిందపడి పసికందుతో సహా తల్లి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. పసికందుతో సహా ఓ తల్లి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు తల్లి, బిడ్డల మృతదేహాలను పోస్టుమార్టంకు పంపి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కుటుంబ కలహాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతురాలి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story