కీలక పరిణామం.. కన్నాను కలిసిన ఎమ్మెల్సీ జంగా

by Disha Web Desk 16 |
కీలక పరిణామం.. కన్నాను కలిసిన ఎమ్మెల్సీ జంగా
X

దిశ ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సమయం సమీస్తున్న వేళ అధికార వైసీపీని దెబ్బకొట్టేందుకు ప్రతిపక్ష పార్టీ పక్కాగా వ్యూహాలు అమలు చేస్తోంది. వైసీపీ అసంతృప్తు నేతను తమ వైపు ఆకర్షిస్తోంది. ఇప్పటికే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.


ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను శ్రీ కృష్ణ దేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కష్ణమూర్తితో పాటు టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్ర శేఖర్ కలిశారు. జిల్లా రాజకీయాలు, పార్టీల పరిస్థితులపై చర్చించారు. గుంటూరు పచ్చిమ, పొన్నూరు, నరసరావుపేట, సత్తెనపల్లి,పెదకూరపాడు నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు. ఈ సందర్బంగా వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి కన్నా లక్ష్మీనారాయణ దిశా నిర్దేశం చేశారు.

Next Story

Most Viewed