Breaking: కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరో కీలక నేత.. త్వరలో గుడ్ బై?

by Disha Web Desk 16 |
Breaking: కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరో కీలక నేత.. త్వరలో గుడ్ బై?
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బాటలోనే మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా చేరిపోయాలా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలి నచ్చక మాజీ మంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు ఏకంగా బీజేపీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లిన విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ప్రస్తుత పరిస్థితులు బాగోలేవన్నారు. పార్టీలో సమస్యలపై హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ప్లోర్ లీడర్‌గా పని చేసిన తన మాటే హైకమాండ్ వినే పరిస్థితిలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావడంలేదన్నారు. బీజేపీ కార్యకర్తలతో మాట్లాడే తీరిక అధిష్టానికి లేదని విష్ణుకుమార్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో విష్ణుకుమార్ రాజు కూడా బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా 2014 ఎన్నికల్లో టీడీపీ పొత్తులో బీజేపీ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడటంతో ఆయన కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.



Next Story

Most Viewed