- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Satulur: పంట పొలంలో రైతు సజీవదహనం
by Disha Web Desk 16 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: పంట పొలంలో ఎండుగడ్డిని తగలబెడుతూ ఆ మంటలు అంటుకొని ఓ రైతు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన పల్నాడు జిల్లాలోని నాదెండ్ల మండలం సాతులూరులో వెలుగులోకి వచ్చింది. బండారుపల్లి వెంకటేశ్వర్లు(70) అనే రైతు తన పొలంలో మొక్కజొన్న పంటను వేశారు. పంట కోసిన తర్వాత మిగిలిన వ్యర్ధాలు పొలంలోనే ఉండటంతో వాటిని తగలబెట్టారు.
అయితే ఆ మంటలకు గాలి తోడైంది. దీంతో పక్కనే ఉన్న తన సోదరుడి పొలంలోని పంటకు వ్యాపించింది. దీంతో ఆ మంటలను ఆపేందుకు ప్రయత్నించగా కింద పడిపోయారు. దీంతో మంటలు వెంకటేశ్వర్లుని చుట్టుముట్టాయి. మంటలు చుట్టుముట్టడంతో వెంకటేశ్వర్లు సజీవ దహనమయ్యారు. వెంకటేశ్వర్లు సజీవ దహనంతో కుటుంబంలో విషాదచ్చాయలు అలుముకున్నాయి.
Next Story