Breaking: ‘వ్యూహం’పై దూకుడు.. కాసేపట్లో సీఎం జగన్‌తో రాంగోపాల్ వర్మ భేటీ

by Disha Web Desk 16 |
Breaking: ‘వ్యూహం’పై దూకుడు.. కాసేపట్లో సీఎం జగన్‌తో రాంగోపాల్ వర్మ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరికాసేపట్లో సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఇప్పటికే తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లారాయన. ఏపీ రాజకీయాలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’ మూవీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి సీఎం జగన్‌తో చర్చించేందుకు ఆర్జీవీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవలే సీఎం జగన్‌ను రాంగోపాల్ వర్మ కలిశారు. ఇంతలోనే మరోసారి భేటీ అవడంతో చర్చనీయాంశంగా మారింది.

కాగా సీఎం జగన్ పొలిటికల్ జీవితం ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జగన్ పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస నటిస్తున్నారు. ఈ మూవీకి అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ మూవీకి సంబంధించి హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన చిన్న సీన్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ సీన్ సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ సాధించింది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం జగన్‌తో దర్శకుడు ఆర్జీవీ భేటీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read,,

పవన్ కల్యాణ్ ఓ రాజకీయ వ్యభిచారి.. దమ్ముంటే నాపై పోటీ చేయ్: ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు

Next Story