Guntur: డ్రైవర్ నిర్లక్ష్యం.. ఏడుగురు దుర్మరణం

by Disha Web Desk 16 |
Guntur: డ్రైవర్ నిర్లక్ష్యం.. ఏడుగురు దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ప్రతిపాడు మండలం కొండెపాడుకు 40 మంది గ్రామస్తులు ఓ శుభకార్యం నిమిత్తం ట్రాక్టర్‌లో చేబ్రోలు మండలం జూపుడికి వెళ్తున్నారు. ఈ సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలంలోనే ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.


క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిలో కొందరికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. ఆస్పత్రిలో క్షతగాత్రుల హాహాకారాలతో మిన్నంటాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు స్థానిక సీసీపుటేజ్‌ను పరిశీలించారు. డ్రైవర్ నిర్లక్షం వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు. ట్రాక్టర్‌ను అతివేగంగా నడపటం వల్లే అదుపుతప్పిందని తెలిపారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. స్టీరింగ్ పట్టేయడంతో ప్రమాదం జరిగిందని ట్రాక్టర్ డ్రైవర్ తెలిపారు.


Next Story