Tadepally: పార్టీ నేతలతో కొనసాగుతున్న సీఎం జగన్ విస్తృతస్థాయి సమావేశం

by Disha Web Desk 16 |
Tadepally: పార్టీ నేతలతో కొనసాగుతున్న సీఎం జగన్ విస్తృతస్థాయి సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ నేతలతో సీఎం జగన్ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికలపై సమావేశంలో చర్చిస్తున్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు, రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. కాగా ఇప్పటికే చేసిన సర్వేలో పలువురికి నెగిటివ్ రావడంతో సీఎం జగన్ అప్రమత్తమయ్యారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా ప్రజల్లో కొంతమందిపై వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో వారిపై సీఎం జగన్ సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పలువురి ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వడం కష్టమనే సంకేతాలు కూడా ఈ సమావేశంలో జగన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Next Story