CM Jagan: నేరుగా వాళ్ల అకౌంట్లలోకి నేడు నగదు జమ

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-05-16 03:13:35  IST  )

సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించనున్నారు....

CM Jagan: నేరుగా వాళ్ల అకౌంట్లలోకి నేడు నగదు జమ
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించనున్నారు. వైఎస్సార్ మత్య్సకార భరోసా నిధులను ఆయన విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. ఉదయం 9.30 లకు తాడేపల్లి నుంచి బాపట్ల జిల్లాకు ఆయన బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు.

Next Story