ఆ విషయంలో మూడేళ్లుగా సీఎం జగన్ ఘన విజయం.. మార్చి 7న మళ్లీ గుడ్ న్యూస్

by Disha Web Desk 16 |
ఆ విషయంలో మూడేళ్లుగా సీఎం జగన్ ఘన విజయం.. మార్చి 7న మళ్లీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక అడుగులు వేస్తున్నారు. బటక్ నొక్కే కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా సిద్ధం సభల వేదికగా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నెల 7న అనకాపల్లిలో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చేయూత నిధులను బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా 45 ఏళ్లకు పై బడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పేద మహిళలకు 3 విడతలుగా రూ. 18,750ను విడుదల చేశారు. ఇప్పుడు నాలుగోసారి కూడా ఈ నిధులను ఆయన విడుదల చేయనున్నారు.


వైస్సార్ చేయూత పథకం ద్వారా రాష్ట్రంలో మొత్తం 31 లక్షల 23 వేల 466 మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సారి వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు సీఎం జగన్ లేఖ రాయనున్నారు. ఈ లేఖలను లబ్ధిదారులకు వాలంటీర్లు అందించనున్నారు. ఈ లేఖలో జగన్ ఎన్నికల సందేశం ఉండనుందని తెలుస్తోంది.

Next Story

Most Viewed