Ap: కోవిడ్‌తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు గుడ్‌న్యూస్

by Disha Web Desk 16 |
Ap: కోవిడ్‌తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: కోవిడ్‌తో చనిపోయిన ఉద్యోగులకు సీఎం జగన్ సర్కార్ అండగా నిలుస్తోంది.కోవిడ్ సమయంలో ప్రజలకు సేవలందిస్తూ చాలా మంది ఉద్యోగులు ప్రాణాలు విడిచారు. వీరి ప్రాణ త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించింది. కారుణ్య నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. కోవిడ్ బాధిత ఉద్యోగ కుటుంబాల నుంచి నియామకాలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాళీలు, రోస్టర్లు, పాయింట్లతో సంబంధం లేకుండా భర్తీ చేయాలని నిర్ణయించింది. ఎక్కడ అయితే ఖాళీ ఉంటుందో అక్కడే భర్తీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది.

కాగా తాడేపల్లి తన క్యాంపు కార్యాలయంలో గతంలోనే సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కరోనాతో ఉద్యోగులు చనిపోయిన అంశంపై చర్చించారు. ఉద్యోగుల పట్ల సానుభూతిగా వ్యవహరించాలని సూచించారు. కోవిడ్ తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. కుటుంబానికి జీవనాధారమైన వ్యక్తిని కోల్పోయిన బాధలో ఉన్న ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులకు సూచించారు.


Next Story

Most Viewed