Tadepally: బాలిక హత్య ఘటన బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం

by Disha Web Desk 16 |
Tadepally: బాలిక హత్య ఘటన బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం
X

దిశ, వెబ్ డెస్క్: తాడేపల్లిలో అంధ బాలిక హత్యకు గురైన విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్ నివాసానికి సమీపంలో హత్య జరగడంతో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని, తాడేపల్లిలో అఘాత్యాలు పెరిగిపోతున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ పరిహారాన్ని త్వరలోనే అందించేందుకు చర్యలు చేపడుతోంది. అటు బాలిక హత్య కేసును ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. పోలీసులు బృందాలుగా గాలించి నిందితుడిని అరెస్ట్ చేశారు. కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed