సర్కారు గుడ్‌న్యూస్.. నేడే అకౌంట్లలోకి డబ్బులు

by Disha Web Desk 9 |
సర్కారు గుడ్‌న్యూస్.. నేడే అకౌంట్లలోకి డబ్బులు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి జగన్‌ ఈరోజు(మే 5న) కళ్యాణమస్తు, షాదీ తోఫా ఆర్థికసాయాన్ని అందజేయనున్నారు. జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకొన్న వారికి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి డబ్బులు అకౌంట్లలో జమ చేస్తున్నారు. వైఎస్సార్ షాదీ తోఫా కింద అర్హులైన 12, 132 మందికి 87.32 కోట్లను విడుదల చేయనున్నారు. కాగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 1 లక్ష రూపాయలు, కులాంతర పెళ్లిళ్ళు చేసుకున్న వారికి రూ. 1.2 లక్షలు, బీసీలకు 50వేలు, బీసీల్లో కులాంతర వివాహాలకు 75 వేల రూపాయలు, దివ్యాంగులకు రూ. 1.5 లక్షలు, భవన కార్మికులకు రూ.40 వేలు వధువు తల్లి అకౌంట్లలో జమ చేయనున్నారు.

Also Read...

CBSE కొత్త రూల్.. ఫెయిల్ అయినవారు పరీక్ష రాయాల్సిన అవసరం లేదు

Next Story

Most Viewed