AP: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. అక్రిడిటేషన్ల విషయంలో సర్కార్ కీలక ముందడుగు

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-06 11:24:05  IST  )

జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.

AP: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. అక్రిడిటేషన్ల విషయంలో సర్కార్ కీలక ముందడుగు
X

దిశ, వెబ్‌డెస్క్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర అక్రిడేషన్ కమిటీని నియమించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 14 మంది అధికారులకు కమిటీలో చోటు కల్పించింది. కాగా, గతేడాది మేలో అక్రిడిటేషన్‌ కార్డుల కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగించిన విషయం తెలిసిందే. ఆ గడువు కూడా ముగిసి నెలలు కావడంతో రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌ నూతన కార్డుల జారీకి కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story