Breaking: ఏపీ ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

by Disha Web Desk 16 |
Breaking: ఏపీ ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 22 నుంచి 31 మధ్య ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేయనుంది. ఈ మేరకు గైడ్ లైన్‌ను విడుదల చేసింది. 2 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన వాళ్లకు రిక్వెస్ట్‌పై బదిలీ చేసే అవకాశం ఉంది. 2023 ఏప్రిల్ 30 నాటికి 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్లు బదిలీలకు అర్హులుగా పేర్కొంది. అలాగే ఒకే చోట 5 ఏళ్లు పూర్తి చేసిన వారికి సైతం రిక్వెస్ట్ బదిలీకి అవకాశం కల్పించింది. అంతేకాదు ఉద్యోగుల బదిలీ నిషేధంపై ప్రభుత్వం సడలింపు ఇచ్చింది... అయితే విద్యాశాఖలో బదిలీలకు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read..

ఆర్-5 జోన్‌లో పరిశ్రమల రాకను అడ్డుకోవడానికే స్కెచ్?

Next Story