- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇంటర్మీడియట్లో ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలు(Intermediate results) విడుదలైన విషయం తెలిసిందే. ఏపీ ఇంటర్ బోర్డు ఈ నెల(ఏప్రిల్) 12వ తేదీన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే అధిక శాతం ఉత్తీర్ణత నమోదైందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) పేర్కొన్నారు. ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే.. ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్లో 44శాతం, సెకండియర్ లో 18శాతం మంది ఫెయిలయ్యారు.
ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లో ఫెయిలైన లేదా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ఆదర్శ పాఠశాలల్లో చదువుతూ ఇంటర్ ఫెయిలైన, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. వారికి వేసవిలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు. ఇందుకోసం KGBV హాస్టళ్లను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల(మే) 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతాయని ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, రెండో సెషన్ మధ్యాహ్నం 02:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.