- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేషన్కార్డు దారులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు
రేషన్కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

దిశ,వెబ్డెస్క్: రేషన్కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రేషన్ కార్డుదారులకు e-KYC ప్రక్రియను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నకిలీ రేషన్ కార్డులు అరికట్టడం, అర్హత కలిగిన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ సాయం అందించడం కోసం ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. ఇటీవల ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ–కేవైసీ ప్రక్రియను ఈ నెల(మార్చి) 31 నాటికి పూర్తి చేయాలని ప్రకటించింది.
ఈ గడువు తర్వాత e-KYC పూర్తి చేయని వారు రేషన్ సబ్సిడీ ప్రయోజనాలను పొందలేరు. ఈ తరుణంలో రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఈ-కేవైసీ చేయించుకునే గడువును అధికారులు పొడిగించారు. ఈ నెల 31తో గడువు ముగియనుండగా దాన్ని ఏప్రిల్ 30 వరకు పెంచారు. దీంతో ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయని వారు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. అయితే మరోసారి ఈ గడువు పెంచే అవకాశం ఉండకపోవచ్చు అని అధికారులు తెలిపారు.






