ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. రేపే ఆ నిధులు జమ

by Muthe.Rajitha |

ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం .

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. రేపే ఆ నిధులు జమ
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. రేపు రాష్ట్రంలోని అర్హులైన రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు జమ కానున్నాయి. ఈ నిధుల విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా చినదాసరిపల్లిలో ప్రారంభించారు. దాదాపు 46.86 లక్షల రైతులకు రూ.7 వేల చొప్పున మొత్తం రూ.3135 కోట్ల నిధులు బుధవారం విడుదల చేయనున్నారు.

ఇందులో కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు రూ.2 వేలు ఉండగా, ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు రూ.5 వేలు ఉన్నాయి. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. కాగా ఈ నిధుల విడత కార్యక్రమంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story