అమరావతి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అధికారిక ఉత్తర్వులు జారీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-04 13:53:19  IST  )

రాజధాని అమరావతి (Amaravati)లో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు కూటమి సర్కార్ మరో తీపి కబురు చెప్పింది.

అమరావతి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అధికారిక ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని అమరావతి (Amaravati)లో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు కూటమి సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. మరో ఏడాది కాలం పాటు వారికి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, 11 ఏళ్లుగా అమరావతి ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత బస సదుపాయం కొనసాగుతోన్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీతో పాటు హైకోర్టు, రాజ్ భవన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులంతా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. జూన్ 27తో ఉచిత బస్సు్కు గడువు ముగియడంతో.. తాజాగా 2026 జూన్ 26 వరకు మళ్లీ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story