శ్రీకాకుళంలో భారీ తిమింగలం

by Disha Web Desk 21 |
శ్రీకాకుళంలో భారీ తిమింగలం
X

దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలోని భావనపాడు సముద్రతీరానికి భారీ తిమింగలం మృతదేహం కొట్టుకువచ్చింది. శుక్రవారం ఉదయం సముద్ర వేటకు వెళ్తున్న మత్స్యకారులు ఈ మృతదేహాన్ని గమనించారు. భారీ తిమింగలం చనిపోయి ఉండటంతో దాని గురించి అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ తిమింగలం దాదాపు 15 మీటర్లు పొడవు, పది టన్నుల బరువు ఉంటుందని మత్స్యకారులు అంచనా వేస్తున్నారు. ఈ తిమింగలం సముద్రంలోనే మృతి చెంది ఒడ్డుకు చేరిందని.. దుర్వాసన రావడంతో తాము గమనించి అటవీశాఖ అధికారులకు తెలియజేసినట్లు మత్స్యకారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు భారీ తిమింగలం మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.



Next Story

Most Viewed