- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకినాడ తీరంలో ప్రమాదం.. జాలర్ల బోటులో పేలిన సిలిండర్
విశాఖలో వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతైన దుర్ఘటన మరువక ముందే.. కాకినాడ సముద్రంలో మరో ఘోరప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్డెస్క్: విశాఖలో వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతైన దుర్ఘటన మరువక ముందే.. కాకినాడ సముద్రంలో మరో ఘోరప్రమాదం జరిగింది. చేపల వేటకు వెళ్లిన బోటులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ సమయంలో బోటులో ఉన్న ఇద్దరు మృత్స్యకారులు తీవ్రంగా పడినట్లు తెలుస్తోంది. జిల్లాలోని తొండంగి మండలం ఎల్లయ్యపేట గ్రామం నుంచి నలుగురు మత్స్యకారులు బోటులో సముద్రంలో వేటకు వెళ్లారు. బోటులోనే ఇద్దరు మత్స్యకారులు వంట చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన జాలర్లతో పాటు.. బోటులో ఉన్న మరో ఇద్దరు జాలర్లు వెంటనే సముద్రంలోకి దూకడంతో.. ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. వెనుకే వచ్చిన మరో బోటులో నలుగురు మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు చేరుకోగా.. గాయపడిని ఇద్దరిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు.
Next Story






