తిరుమలలో ఘనంగా గురు పౌర్ణమి గరుడసేవ

by Naga Rani Yarlagadda |

గురుపౌర్ణమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో గురువారం టీటీడీ (TTD) గరుడవాహన సేవ (Garuda Vahanaseva) నిర్వహించింది.

తిరుమలలో ఘనంగా గురు పౌర్ణమి గరుడసేవ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆషాఢ పూర్ణిమను గురు పౌర్ణమిగా (Guru Pournami) జరుపుకుంటారు. ఈ రోజున దుర్గాదేవిని శాకాంబరీ దేవిగా అలంకరించడంతో పాటు అన్ని దేవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో గురువారం టీటీడీ (TTD) గరుడవాహన సేవ (Garuda Vahanaseva) నిర్వహించింది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల సమయంలో శ్రీమలయప్పస్వామివారు (Sri Malayappa Swamy) గరుడ వాహనంపై తిరుమాఢవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. గరుడవాహనంపై వచ్చిన స్వామివారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. అడుగడుగునా హారతులు పట్టి.. గోవింద నామస్మరణ చేశారు.

Next Story